శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జనవరి 2023 (17:45 IST)

కర్నాటకు చిత్తుగా ఓడిపోనున్న బీజేపీ!?

congressflags
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార భారతీయ జనత పార్టీ చిత్తుగా ఓడిపోతుందని హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేసే ఎస్.ఏ.ఎస్ గ్రూపు సర్వే వెల్లడించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఏకంగా 114 సీట్లను కైవసం చేసుకుంటుందని, బీజేపీకి మాత్రం 65 -75 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ మాత్రం 24 నుంచి 34 సీట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది.
 
ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ పార్టీకి 38.14శాతం నుంచి 40 శాతానికి పెరుగుతుందని, బీజేపీ ఓట్లు 36.35 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతాయని, జేడీఎస్ కూడా 1.3 శాతం మేరకు ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల మద్దతు ఎక్కువగా ఉందని తెలిపింది. అయితే, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ  రాయచూరు, కోలార్, బళ్లారి, గంగావతి, కొప్పల్, దావణగెరే నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని తెలిపింది.