1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 మే 2021 (13:56 IST)

భారత్‌ లో కేసులు తగ్గుముఖం!

భారత్‌ కరోనా వైరస్‌తో పోరాడుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 22, 315 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొత్తగా రెండు లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, 4, 454 కరోనా మరణాలు నమోదు అయ్యాయి.

ప్రస్తుతం దేశం మొత్తంగా 27,20,716 కొవిడ్‌-19 యాక్టివ్‌ కేసులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక 24 గంటల్లో 3, 02, 524 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏప్రిల్‌ 15 తర్వాత ఇప్పుడే తక్కువ కేసులు నమోదు అయ్యాయి.

మరణాల్లో మూడో స్థానం 
88.30 శాతం రికవరీ రేటుతో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా మరణాలు అధికారికంగా మూడు లక్షలు దాటాయి. దీంతో ప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువ నమోదైన దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో(1.13 శాతం) నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 

తమిళనాడు టాప్‌
తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా తమిళనాడు 35 వేల కేసులు,మహారాష్ట్రలో 26 వేల కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక 25 వేల కేసులతో మూడో స్థానంలో నిలిచింది. శనివారం దేశం మొత్తం19 లక్షల 28 వేల 127 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు(మొత్తం 33 కోట్లకు పైనే) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌​ రీసెర్చ్‌ ప్రకటించింది.  ఇప్పటిదాకా 19.60 కోట్లకుపైగా వ్యాక్సినేషన్స్‌ ప్రక్రియ పూర్తైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖా ప్రకటించుకుంది