కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో తన కాబోయే భర్తతో బయటకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, ఆమె కాబోయే భర్తపై కూడా దాడి చేశారని బుధవారం పోలీసులు తెలిపారు. ఈ సామూహిక అత్యాచారంలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఐదు పోలీసు బృందాలను నియమించినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు.
చుర్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు మంగళవారం తన కాబోయే భర్తతో బయటకు వెళ్లిందని ఆయన చెప్పారు. కథౌతా సమీపంలోని రోడ్డు పక్కన తమ మోటార్ సైకిల్ను పార్క్ చేసిన తర్వాత, వారు సమీపంలోని కొండకు వెళ్లారు. ఆ ప్రాంతంలో తిరుగుతున్న నలుగురు వ్యక్తులు ఆ జంటను గుర్తించారు. వారు ఆ మహిళ కాబోయే భర్తను కొట్టి తరిమికొట్టారని పోలీసు అధికారి తెలిపారు.
దీని తర్వాత, నిందితులు ఆ మహిళపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారని అని శ్రీవాస్తవ తెలిపారు. నిందితుల బారి నుండి తప్పించుకున్న తర్వాత, ఆ మహిళ తన కాబోయే భర్తను సంప్రదించిందని, ఇద్దరూ సెమారియా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారని, అక్కడ జరిగిన దారుణ సంఘటనను పోలీసులకు వివరించారని అధికారి తెలిపారు. ఇద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, చికిత్స కోసం సెమారియాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు పంపారని ఏఎస్పీ తెలిపారు.