1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:51 IST)

ఢిల్లీలో దారుణం: సెల్‌ఫోన్ ఛార్జర్ కోసం హత్య!

క్షణికావేశాలు హత్యలుగా మారిపోతున్నాయి. ఒకవైపు మహిళపై అఘాయిత్యాలు.. మరోవైపు చిన్న చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా సెల్ ఫోన్ చార్జర్ వివాదం ఒకరి ప్రాణాలు బలిగొంది. 
 
ఢిల్లీలోని రాన్ హొల్లా ప్రాంతంలో 12 తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సెల్ ఫోన్ చార్జర్ విషయంలో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడ్ని సహవిద్యార్ధులు దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. 
 
తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్థారించారు. మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.