1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (17:45 IST)

గాఢ నిద్రలో ప్రయాణికులు - యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారం...

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం జరిగే సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు క్లీనరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సులో 30 యేళ్ళ ఓ యువతి ఎక్కింది. ఆమెతో పాటు.. మరో 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అయితే, బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా, ఈ యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. 
 
స్లీపర్ బస్సులో ప్రయాణికులంతా నిద్రిస్తుండగా.. బస్సు క్లీనర్ ఆమెను బలాత్కరించినట్టు ఆమె పేర్కొంది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా, ఈ ఘాతుకం జరిగినట్టు సమాచారం. సమయంలో బస్సులో 45మందిపైగా ప్రయాణికులున్నారని ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.