మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (19:04 IST)

ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే..?

మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన తనకు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా తనకు ఇంటి భోజనం కావాలని న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. 
 
అయితే కోర్టు మాత్రం మాజీ మంత్రికి షాక్ ఇచ్చింది. 'ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే అప్పుడు చూద్దాం' అంటూ జడ్జి పేర్కొన్నారు . అయితే తన వయసు 71 ఏళ్లు కావడంతో జైలులో తనకు ప్రత్యేకమైన బెడ్ కావాలని కోరడంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.
 
ఈ నెల 1న మనీ ల్యాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబై కార్యాలయంలో 12 గంటలపైనే ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.