1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (16:05 IST)

దుప్పట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందని..?

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్‌లో ఘోరం జరిగింది. ఓ యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిన పాపానికి యువతి పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. అబ్బాయితో మాట్లాడతావా అంటూ గ్రామస్థులే ఆమెపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. భరత్ నగర్‌కి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఒక షాపు ముందు కూర్చొని మాట్లాడుతున్నారు.
 
దీన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఆమెను చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పోలీసులు పరిశీలించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం. 
 
మొదట అక్కడి వ్యక్తులు వారిద్దరిపై దాడి చేయడం మొదలుపెట్టారు.. ఆమెను అతడిని కిందపడేసి కొట్టడం మొదలుపెట్టారు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుండి తప్పించుకోగా.. ఆమె మాత్రం స్థానికుల చేతుల్లో దెబ్బలు తింది. రక్షించండి అంటూ ఆమె మొరపెట్టుకున్నా కూడా ఎవరూ రక్షించడానికి రాలేదు. దుపట్టా పట్టుకుని లాగి మరీ కొట్టారు.