గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:26 IST)

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

parliament
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా మంగళవారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో సభ సజావుగా సాగడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలుపై చర్చించనున్నారు. 
 
కాగా, పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమై 29వ తేదీతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సారథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ దఫా సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 
 
మరోవైపు, ఈ శీతాకాల సమావేశంలో మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభ, రాజ్యసభకు చెందిన వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ సైతం పాల్గొననున్నారు.