శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జనవరి 2020 (13:35 IST)

గుడియా రేప్ కేసు దోషులకు 30న శిక్ష ఖరారు

ఢిల్లీలో ఐదేళ్ల బాలిక గుడియాను 2013 ఏప్రిల్ 15వ తేదీన కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు మనోజ్​ షా, ప్రదీప్ కుమార్​లను ఢిల్లీ కోర్టు శనివారం దోషులుగా ప్రకటించింది. 'బాధితురాలిపై వికారమైన, తిరుగుబాటు పద్ధతిలో అతి క్రూరంగా నేరానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన యావత్ సమాజ మనసుల్ని కదిలించివేసింది' అని కోర్టు విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. 
 
గుడియాను దోషులిద్దరూ 2013 ఏప్రిల్ 15న కిడ్నాప్ చేసి పలుమార్లు రేప్​కు పాల్పడ్డారు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని రూమ్ లోనే వదిలేసి పరారయ్యారు. చిన్నారిని హాస్పిటల్​కు తరలించగా ఏడాది తర్వాత కోలుకుంది. ఫోక్సో చట్టం కింద ఐదేళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసులో దోషులిద్దరికి ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటికి తీసుకువెళ్తుండగా దోషుల్లో ఒకరైన మనోజ్​షా విలేఖరిపై దాడి చేశాడు.