గౌహతి ఐఐటీలో భవనం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
గౌహతి ఐఐటీలో ఓ విద్యార్థి హాస్టల్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ విద్యార్థి గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ విద్యార్థిని గుర్గావ్కు చెందిన తుషార్ యాదవ్గా గుర్తించారు.
ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సాటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే తుషార్ యాదవ్ ర్యాగింగ్ కారణంగానే చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఐఐటీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ ఏడాది మార్చిలో ఇదే ఐఐటీలో ఎమ్మెస్సీ చదువుతున్న వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ విద్యార్థి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.