1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (12:25 IST)

ఆఫ్రికా దేశాల నుంచి వందలాది మంది ఆచూకీ లేదు.. ఆందోళనలో భారత్

ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వందలాది మంది ప్రజలు ఆచూకీ తెలియడం లేదు. వీరిని ట్రేస్ చేసే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమైవున్నారు. ప్రపంచ దేశాలను కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో పురుడు పోసుకుంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఆచూకీ కోసం ఇప్పటివరకు తెలియరావడం లేదు. 
 
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైకు వెయ్యి మందికిపైగా వచ్చారు. వీరిలో కేవలం 466 మంది ఆచూకీ మాత్రమే గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. ముఖ్యంగా, బీహార్‌కు వచ్చిన 281 మంది ఆఫ్రికా దేశస్థుల జాడ కనిపించక పోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు, దేశంలోని వివిధ విమానాశ్రయాలకు వచ్చిన వస్తున్న ఆఫ్రికా పౌరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మొహరించింది. ఈ రాష్ట్రంలోని నాలుగు విమానాశఅరయాల్లో సిబ్బంది ఉంచినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.