1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (17:52 IST)

ప్రాణాలతో ఉన్న బిపిన్ రావత్... అయితే, 90 శాతం కాలిన శరీరం?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కూలిపోయింది. ఆ సమయంలో అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది చనిపోయినట్టు నీలగిరి జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. 
 
అయితే, ఈ హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాత్రం ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆయన శరీరం 90 శాతం మేరకు కాలిపోయింది. ప్రస్తుతం ఆయన్ను కన్నూరులోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ 80 శాతం కాలిన గాయాలతో బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఉన్నది బిపిన్ రావత్తా లేక కెప్టెన్ వరుణా అనేది తేలాల్సివుంది.