శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (21:01 IST)

యడియూరప్ప అభిమానుల ఆందోళనలు.. జేపీ నడ్డా కితాబు

కర్ణాటక సీఎంగా యడియూరప్పనే కొనసాగించాలని కోరుతూ సుమారు 500 మందికిపైగా వీరశైవ లింగాయత్‌ సాధువులు డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాధువులు సీఎంను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి యడియూరప్పను తొలగిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వారిలో కొందరు హెచ్చరించారు.
 
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కితాబిచ్చారు. పరిస్థితులను ఆయన సొంతంగానే చక్కదిద్దుతున్నట్టు పేర్కొంటూ ప్రశంసించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఆదివారం తోసిపుచ్చారు. 
 
సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిష్ఠానం నుంచి ఆదేశాలు వెలువడిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే.