గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (16:30 IST)

ఇప్పుడు కాపీ కొట్టండి చూద్దాం.. తలకు బాక్సులు తగిలించారుగా!

పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యమే. విద్యార్థుల్లో మార్పు రావట్లేదు. అంతేగాకుండా కాపీ కోసం వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. దీంతో విసిగిపోయిన కర్ణాటకకు చెందిన ఓ విశ్వ విద్యాలయం అధికారులు వినూత్న రీతిలో కాపీయింగ్‌ను అరికట్టే చర్యలు చేపట్టారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల తలలకు అట్టపెట్టలు తగిలించి పరీక్షలు రాయించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భగత్ పీయూ కాలేజీలో థర్డ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు కాపీలు కొట్టేందుకు వీలు కాకుండా వారి ముఖాలకు అట్టపెట్టలు పెట్టించి మరీ పరీక్ష రాయించారు. కళ్ల భాగం వరకే తెరిచి ఉండేలా అట్టె పెట్టలకు రంధ్రాలు పెట్టారు. కానీ ఈ అట్టపెట్టెల వల్ల కొందరు విద్యార్థులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. 
 
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కాలేజీ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం కాస్త కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్. సురేష్ వరకు చేరడంతో కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 'ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని.. విద్యార్థులను జంతువుల మాదిరిగా చూస్తున్నారని సీరియస్ అయ్యారు.