1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (18:08 IST)

దేశంలో కొత్తగా ఏడు రాష్ట్రాలు - వెల్లడించిన కర్నాటక మంత్రి

bangalore city
దేశంలో కొత్తగా మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాటుకానున్నాయి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కొత్తగా మరో తొమ్మిది రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కర్నాటక మంత్రి ఉమేశ్ కత్తి వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ మనస్సులో ఉన్న ఆలోచనల మేరకు దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయనున్నారు. అలాగే, మహారాష్ట్రను మూడు, కర్నాటకను రెండు రాష్ట్రాలుగా చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన చర్చ జరుగుతోందని చెప్పారు. 
 
మరోవైపు, బెంగుళూరు సిటీ పని అయిపోయిందన్నారు. ఈ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. అందువల్ల బెంగుళూరు సిటీ పరిస్థితి ఇంతటితో ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.