శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (18:02 IST)

సొంతింటికే కన్నం వేసిన ఘనులు.. ఆ తర్వాత కారం చల్లి...

thieves
తన స్నేహితుల సహకారంతో సొంతింటికే కన్నం వేశాడో యువకుడు. ఆ తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో దాన్నిదాచిపెట్టేందుకు ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కారం చల్లి కప్పిపుచ్చాలని భావించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ పుదుపరియారానికి చెందిన బైజు అనే యువకుడు తన స్నేహితులు సుని, సుశాంత్‌లతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆర్థిక కష్టాలను ఆధికమించేందుకు సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడ్డాడు. 
 
తన స్నేహితులకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి వారిన ఒప్పించి, తన ఇంటిలో చోరీకి తీసుకెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన తర్వాత తలుపులు తెరిచే అవకాశం ఉన్నప్పటికీ ఆపని చేయకుండా తలుపులు బద్ధలుకొట్టిన బైజు.. ఇంటిలోని బంగారం, డబ్బు, ఇతరాత్రా విలువైన వస్తువులను దోచుకున్నాడు. పైగా, చోరీ చేసిన ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు వీలుగా ఇంట్లో కారం చల్లి, వస్తువులను చిందరవందరగా పడేసి తన స్నేహితులతో కలిసి వెళ్లిపోయాడు.
 
ఇంతలో ఆలయానికి వెళ్లిన బైజు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా, చోరీ జరిగినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన తర్వాత బైజును అనుమానించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకు విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో బైజుతో పాటు చోరీకి అతనికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితులను కూడా అరెస్టు చేశారు.