మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (12:47 IST)

పబ్‌జీ ప్రేమ.. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది.. చివరికి ఏం జరిగిందంటే?

పబ్‌జీ ద్వారా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఇక్కడ ప్రేమలో పడ్డ మహిళకు అల్రెడీ పెళ్లి అయింది. చివరికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాకు చెందిన ఓ వివాహిత.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివసిస్తున్న వ్యక్తితో పబ్‌జీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 
 
ఈ క్రమంలోనే ఆ మహిళ.. అతడిని కలిసేందుకు హిమాచల్ ప్రదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వారణాసికి బయలుదేరింది. అయితే ఆ మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం చాలా చోట్ల గాలింపు చేపట్టారు. అయితే వారు ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. 
 
మరోవైపు పబ్‌జీ ప్రేమికుడిని చూసేందుకు వారణాసి చేరుకున్న ఆ మహిళకు పెద్ద షాక్ తగిలింది. ఇన్ని రోజులు తాను చాట్ చేసింది, క్లోజ్‌గా మాట్లాడింది ఓ 12వ తరగతి చదువుతున్న యువకుడినని తెలుసుకుని కంగుతింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని తన కుటుంబానికి ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆమెను తాను చేసిన తప్పేంటో తెలిసింది. దీంతో తనను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కోరింది.
 
మహిళ ఎక్కడుందో తెలియడంతో.. ఆమె కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కనుగొని.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పబ్‌జీ ప్రేమ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.