1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (23:01 IST)

నచ్చలేదు పొమ్మంది.. బ్రేకప్ ఇచ్చేశానంది.. అంతే నడిరోడ్డుపై నరికేశాడు..

కర్ణాటకలో ఘోరం జరిగింది. ప్రేయసి బ్రేకప్ చెప్పేయడంతో నడిరోడ్డుపైనే ఆమెను కత్తితో నరికిన ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను భయాందోళనలకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ప్రేమ పేరుతో ఇన్నాళ్లు తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేయసి.. ఉన్నట్టుండి నచ్చలేదు పొమ్మంది. అంతేకాకుండా బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ఆమెను నడిరోడ్డుపై నరికేశాడు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కర్ణాటక, జూబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
 
కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్.. అదే ప్రాంతానికి చెందిన ఆషా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత ఐదునెలలకు ముందు ఆషా తన ప్రేమకు బ్రేకప్ ఇచ్చేద్దామని ప్రియుడితో చెప్పింది. దీంతో ఆగ్రహానకి గురైన ఇస్మాయిల్.. సోమవారం ఉదయం.. మాట్లాడాలని ప్రేయసిని రప్పించి .. కత్తితో నరికేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆషా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.