బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (17:14 IST)

పోలీసులకు చుక్కలు చూపించిన కరోనా రోగి.. భార్యను చూడలేక..?

దేశంలో కరోనా పెరిగిపోతోంది. కరోనా సోకిన కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో వైరస్ మరింత వ్యాప్తి చెందేందుకు కారణం అవుతున్నారు. హోమ్​ క్వారెంటైన్​లో ఉండాల్సిన వారు బయట తిరుగుతూ ఇతరులకు కరోనా అంటిస్తున్నారు. 
 
తాజాగా ఓ వ్యక్తి క్వారంటైన్​ నుంచి పారిపోయి మెడికల్​ సిబ్బంది, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాబుల్లా ఖాన్ అనే వ్యక్తి ముంబైలోని బాంద్రా, బోరివాలి మధ్య ఉన్న అనేక దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకొని అరెస్ట్​ చేశారు. నిందితుడికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్​గా నిర్ణారణ అయ్యింది. 
 
దీంతో సదరు నిందితుడ్ని బోరివాలి (వెస్ట్) లోని సాయి నగర్​లో గల క్వారంటైన్​ సెంటర్​కు తరలించారు. అయితే కొద్ది సేపటికే మెడికల్​ సిబ్బంది కళ్లుగప్పి క్వారంటైన్​ సెంటర్​ నుంచి తప్పించుకున్నాడు నిందితుడు. సిబ్భంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న కండివాలీ స్టేషన్​ పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో అతడ్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్​ కేంద్రం నుండి ఎందుకు పారిపోయావని పోలీసులు ప్రశ్నించగా.. తన భార్యను చూడక చాలా రోజులైందని.. ఆమెను కలవాలనుకొని పారిపోయాని సమాధానమిచ్చాడు. అతడు చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు పోలీసులు.
 
కరోనా పాజిటివ్​ రావడంతో క్వారంటైన్​ సెంటర్​కు నిందితుడ్ని తరలించిన సందర్భంలో 'నేను ఇక్కడి నుంచి రెండు రోజుల్లో తప్పించుకుంటా' అంటూ పోలీసులకు సవాలు విసిరాడు. చెప్పినట్లుగానే క్వారంటైన్​ సెంటర్​ నుంచి పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడు నివసించే ఓషివారా ప్రాంతంలో గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. 
 
నిందితుడు ఓ ఫార్మసీ నుండి రెమ్‌డెసివిర్‌ను దొంగిలించాడన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ముంబైలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలో కొత్తగా 4,192 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 82 మంది ప్రాణాలు కోల్పోయారు.