1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 27 డిశెంబరు 2021 (22:54 IST)

చెన్నైలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ క‌రెన్సీను స్వాధీనం చేసుకున్నారు. కోటి 15 లక్షల రూపాయల విలువైన యూఎస్ డాల‌ర్లు సీజ్ చేశారు క‌స్ట‌మ్స్‌ అధికారులు. 

 
షార్జా వెళ్తున్న ప్ర‌యాణికుడి వ‌ద్ద విదేశీ క‌రెన్సీ గుర్తించారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. పట్టుబడిన నిందితుడు పాత నేరస్థుడిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

 
గతంలోనూ ఇదే విధంగా విదేశీ కరెన్సీని తీసుకెళుతూ పట్టుబడినట్లు గుర్తించారు. అలాగే దొంగ నోట్లను కూడా నిందితుడు చలామణి చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్థారించుకున్నారు. నిందితుడి వెనుకల ముఠా ఉన్నట్లు గుర్తించి వారికోసం గాలిస్తున్నారు.