1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (22:53 IST)

ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం.. హత్య.. ఇసుకతో..?

వయోభేదం లేకుండా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లోని బంకాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని పోలీసులు ఓ గుహలాంటి ప్రదేశంలో ఇసుకతో కప్పి వుండగా వెలికి తీశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. హోలీ పండగ రోజున తన స్నేహితులతో ఆడుకుంటున్న చిన్నారి  కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించారు. 
 
చిన్నారితో ఆడుకుంటున్న మరో బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం... చిన్నారిని ఓ ఎరుపు రంగు ఈ-రిక్షాలో తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు రిక్షా డ్రైవర్ కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు డ్రైవర్​ సాగర్​ సోనీని కనుగొన్నారు.
 
ఈ ఘటనతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని రిక్షా డ్రైవర్​ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా చిన్నారిపై అత్యాచారం హత్య జరిగినట్లు తేలింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రిక్షా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.