శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (10:02 IST)

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోసిన ఎమ్మెల్యే

Mizoram MLA
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఎమ్మెల్యే పురుడు పోశారు. ఎమ్మెల్యే సమయానికి స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మిజోరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిజోరంలోని చాంఫై నార్త్‌ ఎమ్మెల్యే జడ్‌ఆర్‌ థైమ్సంగా సోమవారం తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 
 
ఇటీవల సంభవించిన భూకంపాలు, కరోనా వైరస్‌ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే నాగూర్‌ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. 
 
వృత్తిరీత్యా గైనకాలజీస్ట్ అయిన థైమ్సంగా చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్‌ చేశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్‌ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు.