1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (10:58 IST)

మనోజ్ మోదీకి ముకేశ్ అంబానీ సూపర్ గిఫ్ట్..

Ambani
Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ దీర్ఘకాల ఉద్యోగి అయిన మనోజ్ మోదీకి భారతదేశపు అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ రూ.1,500 కోట్ల విలువైన బహుళ అంతస్తుల భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. మోదీ కంపెనీలో కీలక పాత్రకు పేరుగాంచాడు. తరచుగా అంబానీకి కుడి భుజంగా పిలుస్తుంటారు.
 
కంపెనీకి బహుళ-బిలియన్ డాలర్ల ఒప్పందాలను పొందడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. 'బృందావన్' అనే పేరుగల 22-అంతస్తుల భవనం ముంబైలోని ఉన్నత స్థాయి నేపియన్ సీ రోడ్ ప్రాంతంలో ఉంది. ఇది పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మూడు వైపులా సముద్రం చుట్టూ ఉంది.