1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (18:26 IST)

చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారు: సుజాత్ సింగ్

తాను గౌరవప్రదంగా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. 
 
పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే సుజాతా సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ను నియమించిన సంగతి తెలిసిందే. 
 
అయితే.. ఇదంతా చాలా దారుణమైన పద్ధతిలో చేశారని సుజాతా సింగ్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను సోషల్ మీడియాలో చెబుతానని అన్నారు. గత సంవత్సరమే తనను కావాలంటే వెళ్లిపోవచ్చని చెప్పారని కూడా తాజాగా ఆమె వెల్లడించారు.