గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:50 IST)

సిగరెట్ ఇవ్వలేదనీ కాల్పులు జరిపిన దుండగులు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అడిగితే సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బాధితుడు తప్పించుకోగా, కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన అమిర్ ఖాన్ అనే యువకుడు తన మిత్రుడితో కలిసి గురువారం రాత్రి 9:30 సమయంలో ఓ షాపింగ్ మాల్ దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాడు. ఇంతలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమిర్ ఖాన్‌‌ను సిగరెట్ అడిగారు. అందుకతడు నిరాకరించడంతో.. ఆ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. 
 
మాట్లాడుతుండగానే బైక్ మీద కూర్చున్న మరో వ్యక్తి తన పిస్టల్‌ తీసుకుని అమిర్ ఖాన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అదే బైక్‌పై పరారయ్యారు. కాగా అమిర్ ఖాన్ ఛాతీలో ఓ బుల్లెట్ దిగింది. కానీ, అదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.