శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:05 IST)

ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు.. 150 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఇలా కొట్టేశారు..

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు. ఆన్‌లైన్ వాణిజ్యంలో పేరెన్నికగన్న ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ వినియోగదారుల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిఫ్‌కార్ట్‌‌లో మొబైళ్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ శివారులోని అలీపూర్ హబ్‌లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 19న అలీపూర్ హబ్ నుంచ్ బిలాస్‌పూర్‌లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ ఫోన్లను కొట్టేశారని నిర్ధారించారు. ఈ చోరీలో ప్రమేయమున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుల నుంచి 30 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదుపులో తీసుకున్న వారిలో సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌ అనే నలుగురు వున్నారు. వీరంతా పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.