శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:41 IST)

నవ వధువుకు కన్యత్వ పరీక్ష - టెస్టులో విఫలమైందంటూ కట్నం డిమాండ్

victim
రాజస్థాన్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే హేయమైన ఘటన చోటుచేసుకుంది. 24 యేళ్ళ నవ వధువుకు పెళ్లయిన తొలి రోజే కన్యత్వ పరీక్షను అత్తమామలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ వధువు విఫలం కావడంతో రూ.10 లక్షల కట్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ వధువు పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భిల్వారాలో మే 11వ తేదీన ఓ యువతికి వివాహం జరిగింది. అదే రోజు రాత్రి కన్యత్వ పరీక్ష నిర్వహించారని ఆ యువతి తాజాగా ఆరోపించింది. తాను ఆ పరీక్షలో విఫలం కావడంతో భర్త, అత్తమామలు తనపై దాడి చేశారని వాపోయింది. మే 31 స్థానిక ఆలయంలో కుల పంచాయతీ జరిపి తాను శీలవతిని కాదని ముద్ర వేశారని, రూ.10 లక్షలు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. 
 
ఈ యువతికి పెళ్లికి ముందే పక్కింటి వ్యక్తి చేతిలో అత్యాచారనికి గురైందని, ఈ విషయం తెలుసుకున్న అత్తమామలు ఈ కన్యత్వ పరీక్షలు నిర్వహించాలని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సుభాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.