1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (15:20 IST)

జీతాన్ని ముట్టుకోని జైలు సూపరింటెండెంట్.. పైసా ఖర్చు చేయలేదు..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ఓ అధికారి చిక్కాడు. కొన్నేళ్ల నుంచి జీతాన్నే ముట్టుకోని ఆ అధికారికి చిక్కులు తప్పలేదు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. 
 
సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి ఆవరణలో స్పెషల్ విజిలెన్స్ యూనిట్ దాడులు నిర్వహించి భారీ ఆస్తులను వెలికితీశారు.
 
వివరాల్లోకి వెళితే.. సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి రూ. 4 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇల్లు, కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఒక్క పైసా జీతం ఖర్చు చేయడం లేదు. అతని ఖాతాలోకి వెళ్లే డబ్బు బయటకు రావడం లేదు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్‌లోని చౌదరి నివాసం, సహర్సాలోని కార్యాలయంలో ఎస్వీయూ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సోదాల్లో దొరికిన ఆస్తి అతని ఆదాయానికి నాలుగు రెట్లు ఎక్కువ.
 
తుది నివేదిక వచ్చిన తర్వాత చౌదరి ఆస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్వీయూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నయ్యర్ హస్నేన్ ఖాన్ తెలిపారు. 
 
సురేశ్ చౌదరి ముజఫర్‌పూర్ నివాసం, సహర్సా కార్యాలయంపై జరిపిన దాడుల్లో రెండు విలాసవంతమైన భవనాలు బయటపడ్డాయని, వాటి విలువ రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.