మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (15:36 IST)

నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి ఆస్తి రాసిస్తా : సల్మాన్ చిస్టీ

Nupur Sharma
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు దేశ వ్యాప్తంగా బెదిరింపులు వస్తున్నాయి. ఆమెన తల నరికి తెచ్చిన వారికి తన యావదాస్తిని రాసిస్తానని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ పట్టణానికి చెందిన సల్మాన్ చిస్టీ అనే వ్యక్తి ప్రకటించారు. 
 
ప్రస్తుతం నుపుర్ శర్మ బాహ్య ప్రపంచలో కనిపించడం లేదు. ఆమె కోసం వెస్ట్ బెంగాల్ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పైగా, మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాణలు చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి తన యావదాస్తిని రాసిస్తానని సల్మాన్ చిస్టీ ప్రకటించారు. దీనిపై అజ్మీర్ అదనపు ఎస్పీ వికాస్ సాంగ్వాన్ మాట్లాడుతూ, తాను సైతం ఈ వీడియోను వాట్సాప్ ద్వారా చూశానని, సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు తెలుస్తుందన్నారు. సల్మాన్ కోసం గాలిస్తున్నామని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.