1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:10 IST)

రాజస్థాన్ రాష్ట్రంలో వితంతువుకు మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారం

crime
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆరుగురు కామాంధులు ఏకంగా 14 రోజుల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాజస్థాన్‌లోని పహాడీ సబ్‌ డివిజను పరిధిలో ఓ మహిళ భర్తను కోల్పోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి చేరువయ్యాడు. తన ఐదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి.. ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు తీసుకువెళ్లాడు. 
 
ఆమెను అక్కడే 14 రోజుల పాటు నిర్బంధించి ఆరుగురు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు కామా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.