1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:52 IST)

బ్రిగేడియల్ లిద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మరణించిన వారిలో సీడీఎస్ బ్రిగేడియర్ లిద్దర్ కూడా ఉన్నారు. ఈయన భౌతికకాయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈయన అంత్యక్రియలు ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, లిద్దర భౌతికకాయానికి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ వీఆర్ చౌధరిలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లిద్దర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వీరి రోదనలు మిన్నంటుతున్నాయి. వీరిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.