1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (10:02 IST)

లిక్కర్ స్కామ్ మోదీ సృష్టి.. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతాయ్: కేసీఆర్

kcrcm
భారత రాష్ట్ర సమితి చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల సమూహం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, ఎన్‌డిఎ లేదా భారత కూటములు ఇతర మార్గంలో కాకుండా వారికి మద్దతు ఇవ్వవలసి రావచ్చని అన్నారు.
 
తెలంగాణలోని 17 నియోజకవర్గాలలో తన పార్టీ పూర్తి కాకుండా ఎలా రెండంకెల సీట్లను సాధిస్తుందో కూడా మాట్లాడారు. బిజెపి అవకాశాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో తన కుమార్తె కె కవిత అరెస్టు వంటి ప్రశ్నలకు కూడా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు.
 
సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకరైన నామా నాగేశ్వరరావు కోసం జరిగిన ర్యాలీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ అధినేత నాగేశ్వరరావు కేంద్ర మంత్రిగా మారవచ్చని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శక్తికి మించిన హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సహకరించదన్నారు.
 
అలాగే వాస్తవాలను పరిశీలిస్తే 2014లో 119 నియోజకవర్గాలకు గానూ 117 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి గుర్తింపు లేదని స్పష్టం అవుతోందన్నారు. 
 
2014లో మాది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆ సమయంలో మాకు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఎంతో అవసరం. రాజ్యాంగపరంగా చూసినా కూడా కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. కేంద్రంతో సానుకూలంగా ఉన్నాం. 
 
కానీ బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు. పూర్తిగా వ్యతిరేకించాం.అలాగే వాస్తవానికి ఇప్పుడు ఇండియా కూటమి అనేదే లేదు. అదొక భ్రమ మాత్రమే. 
 
మమతా బెనర్జీతోపాటు చాలా మంది కూటమి నుంచి బయటికి వచ్చేశారు. నేను, అరవింద్‌ కేజ్రీవాల్‌, జగన్మోహన్‌రెడ్డి వంటివాళ్లు ఏ కూటమిలోనూ లేము. కాంగ్రెస్‌ అనుకూల పార్టీలు మాత్రమే ఇండియా కూటమితో ఉంటే, చాలా తక్కువ పార్టీలు మాత్రమే ఎన్డీయేలో ఉన్నాయి. ఈ రెండు కూటముల మధ్యే పోటీ అనే భావన సరికాదు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే బలమైన శక్తిగా మారి, రాజ్యమేలబోతున్నాయి. 
 
లిక్కర్ స్కామ్ మొత్తం ప్రధాని మోదీ సృష్టించిన ఒక రాజకీయ కుట్ర.  వాస్తవానికి ఇది బీజేపీ సృష్టించిన రాజకీయ కుంభకోణం మాత్రమే. అది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం. ప్రభుత్వం తెచ్చిన పాలసీని కుంభకోణం అని ఎవరైనా అంటారా? 
 
మోదీ సృష్టించిన కట్టుకథలు కాకపోతే.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? రెండున్నరేండ్లుగా వాళ్లు అరుస్తూనే ఉన్నారు తప్ప ఆధారాలేవి? కవిత, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి అమాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు, వేధిస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.