1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (16:29 IST)

ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయి..

ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా శివారులోని టాస్మాక్ దుకాణంలో చోటు చేసుకుంది. 
 
సోమవారం ఉద్యోగి దుకాణం తెరిచిన సమయంలో 12 సీసాల మధ్యం ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కదంపూజాలో ప్రాంతంలో ప్రభుత్వం మద్యం దుకాణం నిర్వహిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాన్ని సిబ్బంది మూసివేశారు.
 
నిబంధనలు సడలించడంతో.. చాలా రోజుల తర్వాత సోమవారం దుకాణం తిరిగి తెరిచిన సమయంలో 12 బాటిళ్లలో మద్యం ఖాళీగా ఉంది. అయితే, బాటిళ్ల సీసాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించారు. వాటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
టాస్మాక్‌ సీనియర్‌ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో దుకాణం వద్ద ఎలుకలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. అవే సీసాల నుంచి మద్యం ఖాళీ చేశాయని తేల్చారు. ఒక్కో మద్యం బాటిల్‌ ధర రూ.1500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.