బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (09:55 IST)

సహజీవనం చేసి దూరం పెడుతున్నాడని ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి!

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో దారుణం జరిగింది. తనతో కలిసి సహజీవనం చేసిన వ్యక్తి ఇపుడు దూరం పెడుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ యువతి అక్రోశంతో అతనిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దారుణ ఘటన ఆ రాష్ట్ర రాజధాని అగర్తలాకు 50 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, త్రిపురకు చెందిన బీనా (27) అనే మహిళ, సోమన్ (30) అనే వ్యక్తి పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ వచ్చారు. వీరిద్దరూ ప్రేమించుకొని పదేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్ళిపోయారు. 2010 నుంచి మహారాష్ట్రలోని పుణెలో సహాజీవనం చేస్తూ అక్కడే జీవిస్తున్నారు. 
 
అదేసమయంలో సోమన్‌ చదువు కొనసాగించడానికి అవసరమైన డబ్బులను బీనా ఉద్యోగం చేస్తూ సమకూర్చేది. అనంతరం సోమన్‌కు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేస్తూ కాపురం చేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా పుణెలో బీనాతో కలిసి ఉన్న సోమన్‌ 2019లో సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశాడు.
 
అప్పటి నుంచి బీనాతో సోమన్ మాట్లాడటం మానేశాడు. సోమన్‌ కోసం ఆ మహిళ సంవత్సరం నుంచి చాలా ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు అక్టోబరు 19న త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్‌ను ఉన్నట్లు బీనా గుర్తించింది. అతనితో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నించినా సోమన్‌ నిరాకరించడంతో ఆమె విచక్షణ కోల్పోంది. 
 
ఇదే క్రమంలో తనతో మాట్లాడకుండా దూరం పెడుతున్నాడన్న కోపంతో ఉన్న అతనిపై యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో సోమన్ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు బీనాను అరెస్టు చేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.