ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక పద్దుపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అయితే, వేతన జీవులు మాత్రం ఖుషీఖుషీగా ఉన్నారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారు ఒక్క పైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కూడా అంటే 0 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయాన్ని అర్జించినప్పటికీ పన్ను చెల్లించినక్కర్లేదు. ఇలా కేంద్రం ఒక్కసారిగా సానుకూలంగా స్పందించిందో తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో ప్రతి పన్ను చెల్లింపుదారుడుకు రూ.80 వేల వరకు ఆదా అవుతంది. పైగా, దేశ వృద్ధిరేటు తగ్గడం, ప్రజలు ఖర్చులను తగ్గించడంతో పాటు.. మున్ముందు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఈ తరహా సానుకూల నిర్ణయం తీసుకుంది.
కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా మారింది. పాత పన్ను విధానంతో పోల్చితే కొత్త విధానం ఎంతో సరళంగా ఉంది. ఇప్పటికే 70 శాతం పన్ను చెల్లింపుదారుల్లో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్టు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఇక తాజాగా ఆదాయపన్నులో మరిన్న శ్లాబులు జోడించడంతో పాత విధానాన్ని అనుసరించేవాళ్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంది.