శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:25 IST)

23 రోజుల బిడ్డతో విధులకు హాజరైన ఐఏఎస్ అధికారిణి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఐఏఎస్ అధికారిణి రోజుల బిడ్డతో విధులకు హాజరైంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిని సౌమ్యా పాండే. ఈమె ప్రయాగ్ రాజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, ఈమె సరిగ్గా 23 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ప్రశూతి మహిళకు ఆర్నెల్ల వరకు సెలవు తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఈ సెలవు కాలాన్ని ఆమె వినియోగించుకోలేదు కదా.. ఏకంగా రోజుల బిడ్డతో తన కార్యాలయానికి వచ్చి విధుల్లో నిమగ్నమైంది. దీనికి కారణంత తన విధుల పట్ల ఆమెకున్న అంకితభావం. కర్తవ్యం. 
 
తన వడిలో చంటిబిడ్డను కూర్చోబెట్టుకుని ఆమె విధులను నిర్వహిస్తున్న ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. ప్రసవం తర్వాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.