బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:34 IST)

యూపీ మొరదాబాద్‌లో అగ్నిప్రమాదం - నలుగురి సజీవదహనం

fire accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్‌లోని గల్‌షహీద్ ప్రాంతంలోని ఓ మూడు అంతస్తుల భవనంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 
 
ఈ భవనం యజమాని ఇంటిలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. కింది ఇంటిలో స్క్రాప్ మెటీరియల్ ఉంది. వీటికి నిప్పు అంటుకుని పై అంతస్తుకు కూడా పాకాయి. దీంతో మూడో అంతస్తులోని వారు కిందికి రాలేకపోయారు. పైగా, వారిని రక్షించేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. 
 
ఈ ప్రమాదంపై మొరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శైలేంద్ర సింగ్, సీనియర్ పోలీస్ అధికారి హేమంత్ కుటియాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదం వెనుకగల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ భవనంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. దీంతో అనేక మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 12 మందిని రక్షించారు. వారిలో ఐదుగురుతీవ్రంగా గాయపడి నలుగురు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.