శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 27 మే 2019 (18:27 IST)

నా పెళ్లాన్ని నా దగ్గరకు పంపవా? ఐతే నువ్వు చావాల్సిందే... అత్తను హత్య చేసిన అల్లుడు

మనుషుల్లో ఓర్పు క్రమంగా తగ్గిపోతోంది. చిన్నచిన్న సమస్యలనే సుడిగుండాలుగా మార్చేసుకుంటున్నారు. మొండితనం ఎక్కువవుతోంది. ప్రతి చిన్న విషయానికి అవతలి వ్యక్తిపైన విపరీతమైన ద్వేషం పెంచుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులే ఇందుకు కారణం. అందువల్ల ఈమధ్య కాలంలో హత్యలు ఇతర దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. తమిళనాడులో తన కుమార్తెను వేధిస్తున్నందుకు అల్లుడి వద్దకు పంపను అన్నందుకు ఆమెను హత్య చేశాడు అల్లుడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా వండలూరు సమీపంలో సతీష్ కుమార్, సుష్మిత వుంటున్నారు. పెళ్లయి ఏడాది దాటింది. ఇటీవలి ఈ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీటి కారణంగా సతీష్ ఓ రోజు సుస్మితపై చేయిచేసుకున్నాడు. దీనితో సుస్మిత తల్లి విషయం తెలుసుకుని కుమార్తెను తమ ఇంటికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత కొన్నిరోజులకి సతీష్ అత్తింటికి వెళ్లాడు. తన భార్యను తనతో పంపాలనీ, కాపురం చేసుకుంటానని అడిగాడు. దాంతో సుస్మిత తల్లి అందుకు ససేమిరా అన్నది. 
 
ఆమె అలా అనేసరికి సతీష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అర్థరాత్రి దాటాక అంతా నిద్రిస్తున్న సమయంలో పదునైన కత్తి తీసుకుని నిద్రిస్తున్న అత్త గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తన తల్లి రక్తపు మడుగులో పడి వుండటాన్ని చూసిన సుస్మిత విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.