అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాతే..?: తొగాడియా
‘‘రాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాతే మా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తాం’’ అని ఢిల్లీలోని సరస్వతి శిశు మందిర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వీహెచ్పీ అధినేత ప్రవీణ్ భాయ్ తొగాడియా స్పష్టం చేశారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత వీహెచ్పీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తొగాడియా చెప్పారు. ‘‘ఎలాగైనా హిందువులు రామ మందిరం నిర్మిస్తారు. రామ మందిరం నిర్మాణం పూర్తై తర్వాతే వీహెచ్పీ ఆవిర్భావం జరుపుకుంటాం.
పాతికేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లు ఇళ్లు వదిలి వెళ్లారు. నాలుగు లక్షల కాశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించిన తర్వాతే ఆవిర్భావం.’’ అని కూడా ఆయన అన్నారు.