Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?
Skandha Mata
కేవలం దేవీ నవరాత్రుల సందర్భంలోనే కాకుండా, స్కంధమాతను ఎప్పుడైనా పూజించవచ్చు. ఓం దేవి స్కంధమాతాయై నమః అనే మంత్రంతో ఆమెను స్తుతించడం వల్ల భక్తుల జీవితాలలో వుండే ఎలాంటి కష్టాన్నైనా.. ఈ తల్లీబిడ్డలు గట్టెక్కిస్తారని విశ్వాసం. 2025 సంవత్సరానికి, 5వ రోజు పవిత్ర రంగు ఆకుపచ్చ.
అందుకే ఈ రోజున ఆకుపచ్చను ధరించడం మంచిది. ఆకుపచ్చ రంగు సామరస్యం, పెరుగుదల, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించడం స్కందమాత పోషణ శక్తికి అనుగుణంగా ఉంటుంది.
