1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Jagannath Rath Yatra 2024: significance

పూరీ జగన్నాథ రథయాత్ర.. అలా చేస్తే సకల పాపాలు మటాష్

jagannath rathyaatra
పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా సాగుతోంది. జగన్నాథదేవుని రథం తాడు లాగడం లేదా తాకడం చాలా శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. తాడును తాకడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. ఆ రథంలో ముప్పైమూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. రథంతో పాటు తాడును తాకడం ముప్పైమూడు కోట్ల మంది దేవతలను తాకినట్లే అని నమ్మకం. 
 
జగన్నాథదేవుడు రథంలో మరుగుజ్జు అవతారంలో అవతరించాడు. అందుచేత రథం తాడు లాగడం వంటి పవిత్ర కార్యం ఇహ లోకంలోనే లేదు. తాడును తాకడం వల్ల అశ్వమేధ యజ్ఞ ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఈ రథాల తయారీలో లోహాన్ని ఉపయోగించరు. ఈ రథాలు వేప చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. సుత్తి కూడా చెక్కతో తయారు చేస్తారు.
 
ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి వారి వారి రథాలపై కూర్చొని నగరంలో పర్యటిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా 1000 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఆషాఢమాసం ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగిస్తే..?