Dharma Sangrah

లాక్ డౌన్.. ఉదయం పూట సూర్య నమస్కారం చేస్తే..?

Written By సెల్వి
Updated: సోమవారం, 30 మార్చి 2020 (17:46 IST)
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దొరికిన సమయాన్ని మంచి పనుల కోసం కరోనా సోకకుండా జాగ్రత్త పడేందుకు ఉపయోగించాలంటున్నారు.. వైద్యులు. 
 
ఇక ఆధ్యాత్మిక పండితులైతే.. లాక్ డౌన్ నుంచి బద్ధకం పెరిగిపోకుండా వుండాలంటే.. సూర్య నమస్కారం తప్పక చేయండి అంటున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరానికి డి విటమిన్ లభించడమే కాకుండా.. శరీరం చురుకుగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. సాధారణంగా సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది ఆధ్యాత్మిక పండితుల వాక్కు. 
 
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాల చక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.
 
సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. సకల జీవరాశులకు పోషకుడైన సూర్యభగవానుడిని పూజించడం మరిచిపోకూడదని మహర్షులు కూడా చెప్తున్నారు. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుందని, శరీరానికి కావలసిన విటమిన్లు కూడా లభిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.     

అన్నీ చూడండి

విశాఖపట్నం సెంట్రల్ పార్క్ బయట కరెన్సీ నోట్లు

ప్రధాని మోడీ స్కూల్‌మేట్ భూవివాదం పరిష్కారం...

ఇంట్లో పేదరికం తాండవిస్తున్నా.. ఒకే ఇంట్లో ఐదుగురు డాక్టర్లు అయ్యారు.. ఎక్కడ?

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

అక్టోబరు 15 నుంచి యూపీఐ సేవలు భారం కానున్నాయా?

అన్నీ చూడండి

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

తర్వాతి కథనం
Show comments