గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (22:28 IST)

తిరుపతి లడ్డూ కావాలా.. అయితే ఆధార్ చూపించాల్సిందే..

laddu
తిరుపతి లడ్డూను పవిత్ర ప్రసాదంగా పరిగణిస్తున్నామని పేర్కొంటూ, ఆధార్‌ను సమర్పిస్తే ఒక ఉచిత లడ్డూతో పాటు రెండు లడ్డూలను అందజేసే కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్లు తితిదే ప్రకటించింది. 
 
ఈ నిర్ణయం సామాన్య యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు స్పష్టం చేశారు. కొందరు మధ్యవర్తులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. 
 
ఆదివారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో శ్రీధర్‌తో కలిసి ఈఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టోకెన్‌ లెస్‌కు రెండు లడ్డూలు జారీ చేసే కొత్త విధానంపై పలు మీడియా వేదికలపై దుష్ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేస్తున్న అపోహలను తొలగించారు. భక్తులు తమ ఆధార్ ధ్రువీకరించుకుని.. లడ్డూలు పొందవచ్చునని తెలిపారు. 
 
నగరంలో జరిగిన ఓ వివాహానికి 1000కు పైగా లడ్డూలు తీసుకుని పంచిపెట్టినట్లు తమ సోదాల్లో తేలిందన్నారు. లడ్డూను స్వీట్‌గా కాకుండా పవిత్ర ప్రసాదంగా పరిగణించాలన్నారు.