1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. TTD Implements Aadhaar-Linked Laddu Distribution Policy to Combat Black Market Exploitation

తిరుపతి లడ్డూ కావాలా.. అయితే ఆధార్ చూపించాల్సిందే..

laddu
తిరుపతి లడ్డూను పవిత్ర ప్రసాదంగా పరిగణిస్తున్నామని పేర్కొంటూ, ఆధార్‌ను సమర్పిస్తే ఒక ఉచిత లడ్డూతో పాటు రెండు లడ్డూలను అందజేసే కొత్త విధానం అమలులోకి తెస్తున్నట్లు తితిదే ప్రకటించింది. 
 
ఈ నిర్ణయం సామాన్య యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు స్పష్టం చేశారు. కొందరు మధ్యవర్తులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. 
 
ఆదివారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో శ్రీధర్‌తో కలిసి ఈఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టోకెన్‌ లెస్‌కు రెండు లడ్డూలు జారీ చేసే కొత్త విధానంపై పలు మీడియా వేదికలపై దుష్ప్రచారం చేస్తూ భక్తులను గందరగోళానికి గురిచేస్తున్న అపోహలను తొలగించారు. భక్తులు తమ ఆధార్ ధ్రువీకరించుకుని.. లడ్డూలు పొందవచ్చునని తెలిపారు. 
 
నగరంలో జరిగిన ఓ వివాహానికి 1000కు పైగా లడ్డూలు తీసుకుని పంచిపెట్టినట్లు తమ సోదాల్లో తేలిందన్నారు. లడ్డూను స్వీట్‌గా కాకుండా పవిత్ర ప్రసాదంగా పరిగణించాలన్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
02-09-2024 సోమవారం రాశిఫలాలు - కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటారు...