1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Central Archaeological Department withdrawn letter over Tirumala Temples

పురావస్తు శాఖ పరిధిలోకి శ్రీవారి ఆలయం... వెనక్కి తగ్గిన కేంద్రం

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తితిదే ఈవోకు పురావస్తు శాఖ ఒక లేఖ పంపించింది.

Tirumala Temples
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తితిదే ఈవోకు పురావస్తు శాఖ ఒక లేఖ పంపించింది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఆలయాలను తమకు అప్పగించాలంటూ ఆ లేఖ సారాంశం. అలాగే, తమ శాఖ సిబ్బంది వచ్చినపుడు తితిదే అధికారులు పూర్తిగా సహకరించాలంటూ అందులో పేర్కొంది.
 
అయితే, తితిదేకు కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖ వ్యవహారం మీడియాకు లీకైన కొన్ని నిమిషాల్లోనే తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పురావస్తు శాఖ… లేఖపై వెనక్కి తగ్గింది. సమాచార లోపంతోనే ఈ లెటర్ పంపామంటూ వివరణ ఇచ్చుకుంది. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఈవోకు మరో లేఖ పంపింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆదివారం (06-05-18) దినఫలాలు : చెక్కుల జారీలో తస్మాత్....