గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 నవంబరు 2020 (22:18 IST)

ఏకాంతంగా శ్రీవారి పట్టపురాణి బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు ఎప్పుడెప్పుడో తెలుసా?

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించడానికి టిటిడి సిద్థమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయాన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా కూడా నిర్వహించింది టిటిడి. ఆలయాన్ని శుద్ధి చేశారు.
 
అయితే బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఏయే వాహన సేవలు ఏయే రోజు జరుగుతున్నాయో చూద్దాం. ఈ నెల 11వ తేదీ బుధ‌వారం) ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై ఆ రోజు సాయంత్రం చిన్నశేషవాహనం జరుగనుంది. 
 
12వ తేదీ గురువారం ఉదయం పెద్దశేషవాహనం.. రాత్రి హంసవాహన సేవ,
13వ తేదీ శుక్ర‌వారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనం,
14వ తేదీ శ‌నివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం,
15వ తేదీ ఆదివారం ఉదయం పల్లకీ ఉత్సవం రాత్రి గజ వాహన సేవలు జరుగనున్నాయి.
 
అలాగే 16వ తేదీ సోమ‌వారం ఉదయం సర్వభూపాలవాహనం సాయంత్రం స్వర్ణరథం జరుగనున్నాయి. గరుడ వాహనసేవ జరుగనుంది. అంతేకాకుండా 17 మంగ‌ళ‌వారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 18వ తేదీ బుధ‌వారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవలు జరుగనున్నాయి.

19వతేదీ గురువారం మధ్యాహ్నం పంచమి తీర్థం వాహ‌న‌మండ‌పంలోనే జరుగనుంది. ఆ తర్వాత ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే టిటిడి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కారణంగా ఏకాంతంగానే ఉత్సవాలను టిటిడి చరిత్రలో మొదటిసారి నిర్వహించనున్నారు.