1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (13:20 IST)

జమ్మూలో శ్రీవారి ఆలయం.. జూన్ 8న కుంభాభిషేకం

venkateswara swamy
తిరుపతి దేవస్థానం దేశంలోని అనేక నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, జూన్ 8న కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
జమ్మూలో రూ.30 కోట్లతో నిర్మించిన ఈ ఆలయాన్ని 62 ఎకరాల స్థలంలో నిర్మించారని, తిరుపతిలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని సమాచారం. 
 
వైష్ణవ దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉండడం గమనార్హం. ఈ ఆలయానికి 24 గంటల భద్రత కల్పించాలని జమ్మూ ప్రభుత్వాన్ని తితిదే కోరినట్లు తెలిసింది.