విఐపిలు ఆ ఒక్కరోజు తిరుమల రావద్దండి, ఎందుకంటే..?

Written By జె
Updated: బుధవారం, 6 అక్టోబరు 2021 (16:27 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించనుంది. తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో పలు సేవలను టిటిడి రద్దు చేస్తోంది. అంతే కాదు ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. 
 
అయితే ఈనెల 15వ తేదీన తిరుమలలో విఐపి బ్రేక్ దర్సనాలను రద్దు చేసింది టిటిడి. అక్టోబర్ 14వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 15వ తేదీ చక్రస్నానం కారనంగా ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 15వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్ 14వ తేదీన విఐపి బ్రేక్ దర్సనాలకు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. కాబట్టి విఐపిలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టిటిడి విజ్ఞ చేస్తోంది.
 
ఇప్పటికే టిటిడి బ్రహ్మోత్సవాలకు ముందు విఐపి బ్రేక్ ఒకరోజు పాటు రద్దు చేసింది. ఈనెల 4వ తేదీన బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతున్న నేపథ్యంలో టిటిడి బ్రేక్ దర్సనాలను రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్ దర్సనాల రద్దు మామూలుగా జరుగుతోంది. 

అన్నీ చూడండి

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

23-07-2026 బుధవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

తర్వాతి కథనం
Show comments