శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (08:59 IST)

ఏమయ్యా కేటీఆర్ గారూ.. ఇదేనా మీ పనితీరు... గుత్తా జ్వాలా

నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వార్తతో మీడియాలో ఉండే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు.

నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వార్తతో మీడియాలో ఉండే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. ప్రభుత్వపరంగా గతంలో ఇచ్చిన హామీల అమలు ఎక్కడ అంటూ నిలదీశారు. ఈ మేరకు సీఎం కార్యాలయానికి, మంత్రి కేటీఆర్‌కు ఖాతాలకు ట్యాగ్ చేసింది.
 
ఇదే అంశంపై ఆమె సోమవారం చేసిన ట్వీట్‌లో 'బ్యాడ్మింటన్‌ అకాడెమీ ఏర్పాటు చేసేందుకు స్థలం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చింది. కానీ, ఈ విషయంలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. అలాగే గతంలో తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్లాట్‌లు ప్రకటించింది. అందులో భాగంగానే నాకు కూడా ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటికీ ఆ నజరానా కూడా అందలేదు' అని జ్వాలా పేర్కొంది. 
 
ఈ ట్వీట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కు ట్యాగ్‌ చేసింది. అయితే, కొన్ని గంటల తర్వాత జ్వాల తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం. క్రీడాకారిణిగా చాలారోజుల క్రితమే ఆమె బ్యాడ్మింటన్‌కు దూరమైంది.