సంబంధిత వార్తలు
- వింబుల్డన్లో సత్తా చాటిన సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్లో అరుదైన రికార్డ్
- జారుతున్న సెంట్రల్ కోర్టు ... బోరున ఏడుస్తూ నిష్క్రమించిన సెరీనా
- నా కొడుకును విడిచిపెట్టి ఉండలేను... వీసా ఇప్పించండి... ప్లీజ్ : సానియా వేడుకోలు
- ఐపీఎల్పై సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్ స్ఫూర్తిగా అవి ఏర్పడ్డాయి?
- షర్మిలను కలిసిన సానియా మీర్జా సోదరి, అజారుద్ధీన్ తనయుడు.. ఎందుకని?
వింబుల్డన్ డబుల్స్లో సానియా మీర్జా సంచలన విజయం
అమెరికా వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా, మహిళల డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సంచలన విజయాన్ని సాధించింది. అమెరికన్ క్రీడాకారిణి బెథానీ మాటెక్ శాండ్స్తో కలిసి వింబుల్డన్లో ఆడుతున్న సానియా, తొలి రౌండ్ లో ఆరో సీడ్ గా బరిలోకి దిగిన యూఎస్ - చిలీ జోడి డెసిరె క్రాజక్ - అలెక్సా గురాచీతో పోటీ పడిన సానియా జంట 7-5, 6-3 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.
మరో మ్యాచ్లో లారెన్ డెవిస్తో కలసి బరిలోకి దిగిన అంకిత రైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఇక పురుషుల డబుల్స్లో భాగంగా జరిగిన మ్యాచ్లో రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ ఓటమి పాలైంది. ఎడ్వర్డో రోజర్, హెన్రీ కాంటినెన్ జంటతో పోటీ పడిన బొపన్న జోడీ 6-7 (6), 4-6 తేడాతో ఓడిపోయింది.
