శనివారం, 8 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఆగస్టు 2025 (10:39 IST)

Student: హాస్టల్ గదిలో విద్యార్థి అగ్రికల్చర్ ఆత్మహత్య

suicide
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బీఎస్సీ (అగ్రికల్చర్) మూడవ సంవత్సరం చదువుతున్న రిత్విక్ రాజ్ అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. 
 
అతని రూమ్ మేట్స్ హాస్టల్ అధికారులకు సమాచారం అందించారు. అతని ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని అత్తాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.